ప్రతి దినం ఒక గీతా శ్లోకం, దాని అర్ధం మరియు సంగ్రహం గా దాని వివరణ చెప్పుకుందాం ....
నేటి శ్లోకం .... ( గీత లో మొట్ట మొదటి శ్లోకం తో మొదలు పెడుతున్నాము )
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః|
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
[ సంజయుడు వ్యాస మహర్షి శిష్యుడు. వ్యాసుని కరుణతో తానున్న ప్రదేశము నుండియే కురుక్షేత్ర యుద్ధమును చూడగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు సంజయునిని ఈ విధముగా అడుగుచుండెను ]
ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరి సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ?
ధృతరాష్ట్రుడు ఈ విధముగా అడుగుట లో ఒక ప్రాముఖ్యత వుంది. యుద్ధము జరుగు ప్రదేశము దేవతలకు సైతం పూజనీయ స్థానమైన కురుక్షేత్రం. స్వభావరీత్యా ధర్మాత్ములైన పాండవులకు ఆ కురుక్షేత్ర స్థల ప్రభావము అనుకూలముగా ఉంటుందని అతనికి తెలుసు. అందువలన తన పుత్రులైన కౌరవుల యొక్క విజయావకాశాములపై అతనికి గొప్ప సందేహం ఉంది. అటువంటి సందేహముతోనే ధృతరాష్ట్రుడు సంజయుడిని " వారు ఏమి చేసిరి ?" అని ప్రశ్నిస్తున్నాడు. అధర్మ పరాయణులైన వ్యక్తులకు తాము ఆచరించే పనులయందు విజయముపై ఎంత సందేహాస్పదులుగా ఉంటారో భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మనకు తెలియచేస్తున్నది.
రేపు మరియొక శ్లోకంతో మీ ముందుంటాను... సెలవు.
ఓ సారిటు చూడండి.
ReplyDeletehttp://geetaamrutham.blogspot.com/
ధృతరాష్ట్రుని వాక్యము|
ReplyDeleteకం.
శ్రీకరమగు కురుభూమిని
నా కుఱ్ఱలఁ దొడరి పాండునందనులు రణో
త్సేకమున నే మొనర్చిరొ
వాకొనుమా సంజయా ! కృపామతి నాకున్. ౧
ధన్యవాదములు మూర్తి గారు. మీరు పైన ఇచ్చిన బ్లాగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరముగా ఉన్నది. మీ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉండండి.
ReplyDeletemee 'GEETA' chaala bavundi.
ReplyDelete'Vandanaalu mee sramaki..
bagu bagu
ReplyDeleteThank you ! :)
ReplyDelete