నేటి శ్లోకం గీత లో నాల్గవది .....
అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
ఈ పాండుపుత్రుల సైన్యమందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహా యోధులు.
యుద్ధవిద్య యందు ద్రోణాచార్యుడి గొప్ప శక్తిముందు ధృష్టద్యుమ్నుడు అవరోధము కానప్పటికీ, దుర్యోధనుని భయమునకు కారకులైన వారు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతిఒక్కరు కూడా భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటయే ఆతని భయమునకు కారణము. భీమార్జునుల శక్తి దుర్యోధనునికి తెలిసియుండుట చేతనే ఇతరులను వారిరువురితో పోల్చెను.
chaala baavundi
ReplyDelete