నేటి శ్లోకం గీత లో ఐదవది .....
ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||
ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి నరోత్తములైన మహా యోధులున్నారు.
దుర్యోధనుడు గొప్ప రాజనీతి నిపుణుడని ఇదివరకే చెప్పుకున్నాం. యుద్ధము ఆరంభమయ్యే ముందు తన శత్రుసైన్య బలాబలాలను అంచనా వేస్తూ, గురువు సేనాధిపతియైన ద్రోణునికి హెచ్చరిక చేస్తున్నాడు.
No comments:
Post a Comment